News January 14, 2025
జనగామ: హత్య కేసులో నిందితుల ARREST

హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ASP చేతన్ నితిన్ తెలిపారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామలోని ధర్మకంచ వాసి సంపత్, హైదర్, లక్ష్మణ్ స్నేహితులు. వీరికి MHBD వాసి వెంకన్న(34)తో ఘర్షణ జరిగింది. ఈ గొడవని మనసులో పెట్టుకుని శనివారం రాత్రి మద్యం తాగించి మత్తులో బండరాయితో మోది, మెడ, తలపై బీర్ బాటిళ్లతో పొడిచి చంపేశారు. కాగా, 24 గంటల్లో నిందితులను పట్టుకున్నట్లు ASP తెలిపారు.
Similar News
News February 7, 2025
రేపు 11 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్

జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(JNVST) వరంగల్ జిల్లాలోని 11 సెంటర్లలో శనివారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ పరీక్ష నిర్వహిస్తున్న ఈ 11 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రేపు సెలవు ప్రకటించారు.
News February 7, 2025
వైభవంగా మహా కుంభాభిషేకం ప్రారంభం

కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితులు అచలాపురం రిత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. కుంభాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని, ముందుకు సాగే విధంగా కార్యాచరణను అధికారులు రూపొందించారు.
News February 7, 2025
వరంగల్ ‘కారు’ స్టీరింగ్ పోస్టు ఖాళీ..!

వరంగల్ జిల్లా BRS అధ్యక్ష పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరూరి రమేష్ పార్టీని వీడారు. ఆ తర్వాత కారు స్టీరింగ్ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. కీలకమైన జిల్లా అధ్యక్ష స్థానం ఖాళీగా ఉండడంతో నియోజకవర్గాల్లో నేతలు అంతంతమాత్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయాలని కోరుతున్నారు.