News February 11, 2026
జనగామ 10.19%.. స్టేషన్ ఘన్పూర్ 11.53 % పోలింగ్

జనగామ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు విడుదల చేశారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 44,045 మంది ఓటర్లలో 4,489 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని 10.19 శాతం పోలింగ్ నమోదైంది. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18,550 మంది ఓటర్లలో 2,138 మంది ఓటు వేయగా 11.53 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Similar News
News March 17, 2026
ఆధారాలివిగో.. KTR రాజీనామా చెయ్: సీతక్క

TG: మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹57000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న KTR <<19406367>>సవాల్పై<<>> మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేస్తూ… సవాల్కు కట్టుబడి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ₹57000 కోట్లు రుణాలివ్వడమే కాకుండా వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇప్పటివరకు ₹1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని వివరించారు.
News March 17, 2026
NZB: హనుమాన్ జయంతి వేడుకల అనుమతి ఇవ్వాలి: VHP

ఏప్రిల్ 2న జిల్లాలోని NZB, బోధన్, ఆర్మూర్లలో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు కోరారు. NZB CP సాయి చైతన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో VHP విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేశ్, హిందూవాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News March 17, 2026
సెక్రటేరియట్ టవర్స్: AC, ఎలక్ట్రికల్, పంబ్లింగ్ వర్క్స్కు రూ.2316 కోట్లు

AP: అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ టవర్స్లో హైసైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్, ఫైర్ అలారమ్, పంబ్లింగ్ తదితర పనులకు రూ.2316.88 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం CRDAకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ GO ఇచ్చింది. GAD టవర్తో పాటు 1, 2, 3, 4 టవర్లలోని సదరు పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 53L చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు.


