News March 14, 2025
జనగామ: 17 పాఠశాలల్లో కృత్రిమ మేథ బోధన: కలెక్టర్

కృత్రిమ మేథ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన అభ్యసనా సామర్థ్యాలను సాధించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన జిల్లాలోని 17 ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కృత్రిమ మేథ బోధన వెనుకంజలో ఉన్న విద్యార్థులకనుగుణంగా ప్రశ్నలను రూపొందించి, వారిలో అభ్యసనా సామర్థ్యాల పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు.
Similar News
News February 24, 2026
WGL: ఇంటర్ పరీక్షలు.. పేపర్ లీకైతే ఇట్టే తెలిసిపోతుంది..!

ఉమ్మడి WGLలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఈసారి ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల హాల్ టికెట్లపై ముద్రించిన QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్ను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రశ్నాపత్రాలపై కూడా క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయడంతో పేపర్ లీక్ ఘటనలు జరిగితే సదరు కేంద్రాన్ని వెంటనే గుర్తించవచ్చు. పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేయనున్నాయి.
News February 24, 2026
KMR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు (27) అనే యువకుడు మృతి చెందాడు. బైకుపై గ్రామానికి వస్తుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొన్నాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలైన రాజును ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 24, 2026
DANGER: HYDలో విష జ్వరాలు!

HYDలో దోమలు చిత్రహింసలు పెడుతున్నాయి. మూసీ పరిసరాల్లో లేకున్నా దోమలు విపరీతంగా వ్యాపించాయి. వేలాది దోమలు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఉప్పల్, చిల్కానగర్లో విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కోరంటి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చేరినట్లుగా పలువురు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దోమల నివారణకు చర్యలు లేవని ఆరోపిస్తున్నారు.


