News February 2, 2025
జనగామ: 23 ప్రాక్టికల్ కేంద్రాలు.. 4,714 మంది విద్యార్థులు

రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో జనరల్, వోకేషనల్ విద్యార్థులు 4,714 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 13, 2025
పిల్లలకు థియేటర్ ఎంట్రీపై ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

TG: రా.11 నుంచి ఉ.11 లోపు థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై హైకోర్టు <<15284831>>ఆంక్షలు విధించడంపై<<>> అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ తీర్పుతో తాము నష్టపోతామని మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్లో ఉన్నందున అప్పీలుపై జోక్యం చేసుకోలేమని CJ బెంచ్ స్పష్టం చేసింది. ఆ పెండింగ్ పిటిషన్లోనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
News February 13, 2025
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు

తూంకుంట మున్సిపల్ పరిధిలోని కోమటికుంటలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో హైడ్రా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ నిర్మించినట్లు గుర్తించి నేలమట్టం చేశారు.
News February 13, 2025
గద్వాల: కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడంతో పాటు,నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధికారులకు ఆదేశించారు. గురువారం గద్వాల మండలంలోని పుటాన్ పల్లి గ్రామంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(గర్ల్స్)ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో పరిస్థితులను సమీక్షించి, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.