News February 7, 2025

జనగామ: 30 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్

image

జనగామ జిల్లా కలెక్టరేట్లోని సమాచార పౌరసంబంధాల శాఖ, విద్యా శాఖ, ఉద్యానవన శాఖ, పంచాయతీ శాఖతో పాటు పలు కార్యాలయాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. సమయానుగుణంగా కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. సమయపాలన పాటించని 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు హాజరుకాని వారి వివరాలపై ఆరా తీశారు.

Similar News

News July 8, 2025

భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

image

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.

News July 8, 2025

ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

image

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.

News July 8, 2025

జగిత్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

image

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.