News February 3, 2025
జనగామ: 5న కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5న రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కిసాన్ మేళాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 23, 2025
ధర్మపురి: అభివృద్ధికి కృషి చేసిన నేతకు గుర్తింపు కరువు

ధర్మపురి నియోజకవర్గంలో కాక వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన జీవించి ఉన్న సమయంలో ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం ఆయన జయంతి,వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించినప్పటికీ, నేడు ధర్మపురిలో కార్యక్రమాలు జరగకపోవడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News December 23, 2025
JGTL: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు CCLలు మంజూరు

పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు 2 రోజుల CCLలు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డిసెంబర్ 13, 14 తేదీలకు రెండు CCLలు వర్తిస్తాయని DEO కె.రాము తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు హాజరు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉపాధ్యాయులకు సంబంధిత MEO, HMలు CCLలను ప్రిజర్వ్ చేయాలని సూచించారు.
News December 23, 2025
టాప్ స్టోరీస్

* పరిషత్ ఎన్నికలపై త్వరలో నిర్ణయం: CM రేవంత్
* కూటమి ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తుంది: CM చంద్రబాబు
* వైసీపీని పర్మినెంట్గా అధికారానికి దూరం చేస్తా: పవన్
* ఏపీ పెట్టుబడులపై KCR వ్యాఖ్యల దుమారం.. మంత్రుల ఫైర్
* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత
* ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
* భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు


