News March 7, 2025
జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: ఎంపీ

జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పరవాడలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రానికి సంబంధించి జనరిక్ మందుల షాపును శుక్రవారం ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్య ఖర్చులను తగ్గించడంలో జనరిక్ షాపులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2000కు పైగా జనరిక్ మందుల షాపులు ఉన్నాయన్నారు.
Similar News
News December 4, 2025
ఇంటి చిట్కాలు

* మినరల్ వాటర్ క్యాన్ను శుభ్రం చేసేందుకు బేకింగ్ సోడా, రాళ్ల ఉప్పు, నిమ్మరసం వేసి పావుగంట తర్వాత క్యాన్ను క్లీన్ చేస్తే సరిపోతుంది.
* బట్టల మీద ఇంక్ మరకలు పోవాలంటే మరకపై కాస్త నీరు చల్లి, పేస్ట్ తీసుకొని బ్రష్తో రుద్ది నీటితో వాష్ చేస్తే మరకలు పోతాయి.
* అగరొత్తుల నుసితో ఇత్తడి సామన్లు శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* లెదర్ వస్తువులను నిమ్మచెక్కతో శుభ్రం చేస్తే మెరుస్తాయి.
News December 4, 2025
ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.
News December 4, 2025
వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.


