News December 26, 2024

జనవరి 3న బీసీ విద్యార్థులతో కలెక్టరేట్ల ముట్టడి: ఆర్.కృష్ణయ్య

image

16.75 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌బాగ్‌లో వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజురీయంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడించనున్నట్లు తెలిపారు.

Similar News

News January 24, 2025

HYD: ఇన్‌స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST

image

ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్‌ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.

News January 24, 2025

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149‌గా నిర్ణయించారు. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT

News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT