News January 16, 2026

జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.

Similar News

News February 18, 2026

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌(HPCL) ఇంజినీర్, Jr. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 25 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(CBT), గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/

News February 18, 2026

PPP మోడల్‌లో వంద పడకల ఆస్పత్రులు: మంత్రి సత్యకుమార్‌

image

AP: ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని భావించే కూటమి ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆళ్లగడ్డ, కొవ్వూరు వంటి ప్రాంతాల్లో ఆస్పత్రుల సామర్థ్యం పెంచాలన్న సభ్యుల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. 50 పడకల కన్నా తక్కువ సౌకర్యాలున్న 61 నియోజకవర్గాలను గుర్తించామన్నారు. మొదట PPP మోడల్‌లో అక్కడ 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు.

News February 18, 2026

చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

image

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.