News February 25, 2025

జనసంద్రంగా శ్రీశైలం

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.

Similar News

News November 13, 2025

పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

image

మహబూబ్ నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.

News November 13, 2025

గద్వాల్ కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

image

గద్వాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె.సంధ్యా కిరణ్మయి కలెక్టర్ సంతోష్‌ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయనను కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ జిల్లాను అన్ని పారామీటర్స్‌లో ముందు ఉంచాలని, జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

image

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్‌ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్‌ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.