News March 15, 2025

జనసేనను బీజేపీలో విలీనం చేయడం మంచిది: తులసి రెడ్డి

image

జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి పవన్ కళ్యాణ్‌కు సూచించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ల ముగ్గురూ కీలు బొమ్మలని అన్నారు. అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందన్నారు.

Similar News

News November 17, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. ధరలు ఇలా..!

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.19,000 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.18 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.15,700 కి చేరింది. కాగా, నేడు పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు తెలుపడంతో మార్కెట్‌కు పత్తి రాలేదు.

News November 17, 2025

20న బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

image

బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న పట్నాలోని గాంధీ మైదానంలో కార్యక్రమం ఉంటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ప్రకటించారు. అదే రోజు మంత్రుల ప్రమాణం ఉంటుందా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News November 17, 2025

సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

image

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్‌ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్‌లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్‌ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.