News October 19, 2024

జనసేనలో చేరిన కూతురు.. ముద్రగడ స్పందించేనా?

image

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరడంతో తూ.గో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల వేళ పవన్‌కు జైకొట్టిన ఆమె ఇవాళ జనసేన కండువా కప్పుకున్నారు. తన కుటుంబాన్ని విడదీసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటూ అప్పట్లో ముద్రగడ ఆరోపించగా.. తాజాగా క్రాంతి చేరికపై ఆయన ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు క్రాంతికి కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్..

Similar News

News December 11, 2025

PHC & UPHC సేవల్లో అగ్రస్థానంలో తూ.గో జిల్లా

image

జూన్ 2025 – డిసెంబర్ 2025 వరకు నిర్వహించిన IVRS Perception Feedback Analysisలో తూ.గో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 87.5% సానుకూల స్పందన నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ ర్యాంకింగ్ జిల్లా వైద్య ఆరోగ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. అలాగే మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలు అందించాల్సిన బాధ్యత పెరిగిందన్నారు.

News December 11, 2025

రాజమండ్రి: ‘యూరియా కొరత లేదు’

image

జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7599.34 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీసీఎంఎస్‌లో 257.36, పీఏసీఎస్‌లో 2530.03, ఆర్ఎస్కేల్లో 114.53, ప్రైవేట్ డీలర్ల వద్ద 1993.10, మార్క్ఫెడ్ వద్ద 2604.20, హోల్సేల్ ప్రైవేట్ డీలర్ల వద్ద 100.14 మెట్టు టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News December 11, 2025

కందుల దుర్గేశ్‌కు 7వ ర్యాంకు

image

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.