News February 26, 2025
జనసేన ఆవిర్భావ వేడుకలు.. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈయనే..!

జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కర్నూలు పార్లమెంటుకు చింతా సురేశ్ నియమితులయ్యారు. కాగా, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
Similar News
News January 8, 2026
కర్నూలులో రూ.16,699 పలికిన ధర

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మిర్చి సూపర్-10 రకం క్వింటా రూ.16,699 పలికింది. మిర్చి-5 రకం రూ.16,599, మిర్చి బాడిగ రకం రూ.15,809కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కందులు క్వింటా గరిష్ఠ ధర రూ.7,249, కనిష్ఠ ధర రూ.1,669 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ. 8,700, మినుములు రూ.7,569, మొక్క జొన్నలు రూ.1,849, ఆముదాలు రూ.6,104 పలికాయి.
News January 7, 2026
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.
News January 6, 2026
రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.


