News March 2, 2025

జనసేన కమిటీలో ప్రకాశం జిల్లా నేతలకు కీలక బాధ్యతలు.!

image

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను మార్చి 14న పిఠాపురంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నిర్వహణ కోసం కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో, జిల్లా జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జనసేన ఇన్‌ఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్‌లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించినట్లుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Similar News

News March 27, 2025

ప్రకాశం జిల్లాలో టెన్షన్.. టెన్షన్

image

ప్రకాశం జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఆయన గెలుస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

News March 27, 2025

మార్కాపురం: ఇద్దరు యువకుల మృతి

image

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. అర్ధవీడు(M) నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్‌లోని బంధువుల ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద డీసీఎం వీరిని ఢీకొట్టింది. ఇంద్రసేనారెడ్డి అక్కడికక్కడే చనిపోగా.. కాశిరెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

News March 27, 2025

ప్రకాశం: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

image

ప్రకాశం జిల్లాలో MPP, వైస్ MPP, కో ఆప్షన్ నెంబర్, ఉపసర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఎస్పీ ఒంగోలులో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాలలో 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. నిరంతరం సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!