News April 18, 2024

జనసేన తీర్థం పుచ్చుకున్న వట్టి పవన్ కుమార్

image

మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్ కుమార్ గురువారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భీమడోలు మండలం ఏం.ఏం పురం గ్రామానికి చెందిన వట్టి పవన్ కుమార్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా భుజాన వేసి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో, ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తానని వట్టి పవన్ కుమార్ స్పష్టం చేశారు.

Similar News

News January 8, 2026

ప.గో: యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్‌తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 8, 2026

నేడు భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు

image

భీమవరం డీఎన్ఆర్ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని సూచించారు.