News April 28, 2024

జన్నారంలో వడ దెబ్బతో యువకుడి మృతి

image

వడదెబ్బతో యువకుడు మృతి చెందిన సంఘటన జన్నారం పట్టణంలో జరిగింది. పట్టణంలోని వినాయక్ నగర్‌కు చెందిన మేడిశెట్టి మహేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం దేవాలయానికి వెళ్లే క్రమంలో వడదెబ్బ తగలడంతో మహేశ్ పోన్కల్ ప్రాంతంలో ఉన్న ఓ డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Similar News

News October 14, 2025

ADB: 2 వారాలు.. 26 మోసాలు.. మీరూ జాగ్రత్త..!

image

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్‌‌ఫోర్ట్ కావాలని ఆన్‌లైన్‌లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 14, 2025

ఆదిలాబాద్: నైపుణ్యంతో న్యాక్ సర్టిఫికెట్స్

image

పనిలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు బ్యాచ్‌లకు ఒక రోజు RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందించనున్నట్లు ట్రైనింగ్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందుటకు శిక్షణ రుసుం రూ.1,200 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154548063 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 13, 2025

ఆదిలాబాద్‌లో బంగారు ధర రికార్డు

image

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.