News January 25, 2025

జన్నారం: అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..!

image

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేష్ బెహరన్ దేశంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు తిమ్మాపూర్‌లో జరిగాయి. అతని బావమరిది భార్య లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రజిత (30) ద్విచక్ర వాహనంపై నుంచి పడడంతో మేదర్‌పేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Similar News

News December 4, 2025

GNT: మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు నివాళి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతి నేడు. ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరులో 1933 జులై 4న జన్మించారు. ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ఏకంగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ‘అజాతశత్రువు’గా, మచ్చలేని నేతగా, గొప్ప పరిపాలకుడిగా ఆయనకు మంచి పేరుంది.

News December 4, 2025

పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

image

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.

News December 4, 2025

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్‌స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్‌కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.