News January 25, 2025
జన్నారం: అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు..!

జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేష్ బెహరన్ దేశంలో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు తిమ్మాపూర్లో జరిగాయి. అతని బావమరిది భార్య లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రజిత (30) ద్విచక్ర వాహనంపై నుంచి పడడంతో మేదర్పేటలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్షిప్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News December 5, 2025
MBNR: ఎన్నికల వేళ… జోరందుకున్న దావత్లు!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.
News December 5, 2025
ఉమ్మడి జిల్లా HMలతో ITDA ఇన్ఛార్జ్ PO సమావేశం

మెనూ అమలు బాధ్యత HMలదేనని ITDA ఇన్ఛార్జ్ PO యువరాజ్ మార్మాట్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల HMలు, సంక్షేమ అధికారులు, డిప్యూటీ వార్డెన్లతో ఉట్నూర్లో సమావేశం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నూతన మెనూ అమలులో చిన్నపాటి ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


