News February 23, 2025
జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.
Similar News
News October 13, 2025
MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
News October 13, 2025
సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు- అదనపు కలెక్టర్

జిల్లాలో సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కీమ్యా నాయక్ ఆదేశించారు. ప్రభుత్వం వరి ధాన్యం గ్రేడ్-ఎ రకానికి రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. అదేవిధంగా సన్నరకం వరికి రూ.500 బోనస్ ఇస్తుందని చెప్పారు. సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 13, 2025
PGRS సిబ్బంది పనితీరు మెరుగుపరడాలి: కలెక్టర్

కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్, PGRS సిబ్బంది తమ పనితీరు మార్చుకుని ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కారం అనంతరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం అర్జీలు రాయడానికి సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో J.C, DRO, PD, ఇతర అధికారులు పాల్గొన్నారు.