News May 26, 2024
జన్నారం: కారు ఢీకొని ఉపాధి హామీ కూలీ మృతి

జన్నారం మండలంలోని రోటిగూడకు చెందిన కందుల లచ్చన్న అనే ఉపాధి హామీ కూలీ కారు ఢీకొని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కందుల లచ్చన్న శనివారం ఉపాధి హామీ పనిని ముగించుకొని వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారు ఢీకొందన్నారు. ఈ ప్రమాదంలో లచ్చన్నకు గాయాలు కాగా కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట, కరీంనగర్ అటు నుంచి హైదరాబాద్ నిమ్స్ తరలించగా అక్కడ మృతి చెందారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయితీ వద్దు.. పల్లె ప్రగతే ముద్దు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1500 పైగా గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరగగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మద్దతుదారులు స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియడంతో గెలిచినవారు, ఓడినవారు రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని విస్మరించొద్దని ప్రజలు పేర్కొంటున్నారు. అందరూ కలిసి స్థానికంగా నెలకొన్న కుక్కలు, కోతుల బెడద తొలగించాలని.. రోడ్ల, మురుగు కాలువల వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికలైనా ఆగని జంపింగ్లు

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి. బూత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు కనిపించగా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కమలం తన బలాన్ని ప్రదర్శించింది. అయితే సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు నిధుల కోసం అధికార కాంగ్రెస్లోకి చేరుతున్నారు. ఇదిలా ఉండగా స్వతంత్రులు, మరికొందరు సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటే అందులోకి చేరి తమదైన గుర్తింపు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 18, 2025
ఆదిలాబాద్: ప్రమాణ స్వీకార పత్రం ఇదే..!

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇటీవల పంచాయతీ రాజ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన తేదీని 22న మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణానికి పత్రం విడుదల చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం గెలుపొందిన వారు సిద్ధంగా ఉన్నారు.


