News March 21, 2025

జన్నారం: కెనాల్‌లో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

హుజూరాబాద్ మండలంలోని కాకతీయ కెనాల్‌లో గల్లంతై డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన అరవింద్ కరీంనగర్‌లోని SRR డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. 19వ తేదీన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కాగా, నిన్న మృతదేహం లభ్యమైంది. 

Similar News

News July 11, 2025

కృష్ణా: అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా ఇదే.!

image

అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్‌ను మన మిత్ర వాట్సాప్‌ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌ గ్రీవెన్స్‌ మాడ్యూల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.

News July 11, 2025

కరీంనగర్: రేపే చివరి అవకాశం

image

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.

News July 11, 2025

అరుణాచలంలో మోత్కూర్ వ్యక్తి దారుణ హత్య

image

మోత్కూర్‌లోని ఇందిరానగర్ కాలనీకి చెందిన చిప్పలపల్లి విద్యాసాగర్ అరుణాచలంలో దారుణ హత్యకు గురయ్యారు. గురువారం దుండగులు ఈజీ మనీ కోసం అతని మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపు విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఇందిరానగర్ కాలనీలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ దుర్మార్గానికి తలపడ్డవారిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.