News February 8, 2025
జన్నారం: ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు ఎమ్మెల్యే.

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించి విధించిన ఆంక్షలు ఎత్తివేయడం జరిగిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఈ విషయంపై చీప్ కన్జర్వేటర్కు శుక్రవారం వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన CCF ఆధారాలు చూపించి రాకపోకలు సాధించుకోవచ్చు సాగించుకోవచ్చని తెలిపినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో వివరించారు.
News January 2, 2026
KMR: ఈ నెల 3న జాబ్ మేళా

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 2, 2026
ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.


