News February 27, 2025
జన్నారం: 2రోజులపాటు పక్షి మహోత్సవం

కవ్వాల్ అభయారణ్యం, గోదావరి పరివాహక ప్రాంత పక్షి వైవిధ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు మార్చి 1, 2 తేదీల్లో పక్షి మహోత్సవాన్ని నిర్వహించనున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మా రావ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 1, 2 తేదీల్లో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద పక్షి మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రకృతి, పక్షి ప్రేమికులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు.
Similar News
News October 19, 2025
బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ ఇన్స్టా పోస్టు ద్వారా తెలియజేశారు. ‘చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు. మా హృదయాలు నిండిపోయాయి. ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి. కృతజ్ఞతలతో పరిణీతి, రాఘవ్’ అని రాసుకొచ్చారు. 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
News October 19, 2025
కృష్ణా: కార్తీకమాసానికి ఆలయాలు ముస్తాబు

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హిందువులు నియమనిష్టలతో ఆచరించే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలకు ఆలయ నిర్వాహకులు సర్వసన్నద్ధమవుతున్నారు. కార్తీకంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల సూచన.
News October 19, 2025
పెనుగంచిప్రోలు: లొంగిపోయిన చిట్టీల వ్యాపారి

పెనుగంచిప్రోలులో గత వారం రోజుల క్రితం సుమారు రూ.5 కోట్లతో పరారైన చిట్టీల వ్యాపారి చిన్న దుర్గారావు ఆదివారం సీఐ కార్యాలయంలో లొంగిపోయారని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో మోసాలు చేసి దుర్గారావు పారిపోగా, ఎస్సై అర్జున్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.