News November 11, 2024

జన్నారం: 26 ఏళ్ల తర్వాత కలిసిన ఆపూర్వ కలయిక

image

జన్నారం మండలంలోని ఇందన్పల్లి జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ టెన్త్ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ పాఠశాలలో 1998-89 సంవత్సరంలో టెన్త్ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. నాడు తమకు పాఠాలు బోధించిన గురువులను వారు శాలువాలు కప్పి సన్మానించారు అనంతరం తమ పాత జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు.

Similar News

News December 11, 2025

హీరాపూర్‌: కోడలిపై అత్త విజయం

image

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.

News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.

News December 11, 2025

ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

image

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.