News February 8, 2025

జన్నారం:10న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళ

image

జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీ కళాశాలలో పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళాను నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్ బండి రాములు తెలిపారు. ఫిబ్రవరి 10న తమ కళాశాలలో అప్రెంటిషిప్ మేళ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు బయోడేటా ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ హాజరు కావాలని ఆయన సూచి. పెన్నార్ ఎలక్ట్రికల్స్, రానే ఇంజన్ వాల్స్, తదితర కంపెనీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. 

Similar News

News December 3, 2025

నెల్లూరు జిల్లాలో పెరిగిన పంట నష్టం..!

image

దిత్వా తుఫానుతో నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా బోగోల్, బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు,సంగం, అల్లూరు మండలాల పరిధిలో 29 గ్రామాల్లో 116 హెక్టార్లలో నర్సరీ దశలో, 507 హెక్టార్లలో సాగులో ఉన్న వరిపంట దెబ్బతింది. ఇందుకు సంబంధించి 439 మంది రైతులు నష్ట పోయారు. మొంథా తుఫానుతో ఇటీవల చేతికందే దశలో పంట దెబ్బతినగా.. మరోసారి దిత్వా తుఫాన్‌తో మరోసారి రైతులకు నష్టం వాటిల్లింది.

News December 3, 2025

మద్దిపాడులో వసతి గృహాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

image

మద్దిపాడులోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వద్ద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 3, 2025

ఆ విమానం ఎక్కడ..? మళ్లీ వెతుకులాట!

image

దశాబ్దం కింద కనిపించకుండా పోయిన విమానం కోసం మళ్లీ వెతుకులాట మొదలవనుంది. 2014 MAR 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన MH-370 విమానం అదృశ్యమైంది. ఇది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మారింది. ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిందన్న అనుమానంతో 50 విమానాలు, 60 ఓడలతో గాలించినా దొరకలేదు. MARలో సెర్చ్ ఆపరేషన్ ముగించగా, ఈ నెల 30న మళ్లీ గాలింపు మొదలుపెడతామని మలేషియా తాజాగా ప్రకటించింది.