News February 8, 2025
జన్నారం:10న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళ

జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీ కళాశాలలో పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళాను నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్ బండి రాములు తెలిపారు. ఫిబ్రవరి 10న తమ కళాశాలలో అప్రెంటిషిప్ మేళ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు బయోడేటా ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ హాజరు కావాలని ఆయన సూచి. పెన్నార్ ఎలక్ట్రికల్స్, రానే ఇంజన్ వాల్స్, తదితర కంపెనీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News February 16, 2026
ఖమ్మం: ఆ మంత్రి రాకకు ‘కొండ’oత ఎదురుచూపులు..!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానం స్వయంగా తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సూచనలతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల బీ – ఫారంలను సీల్డ్ కవర్లలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్పర్సన్, మంత్రి కొండా సురేఖ ఖమ్మానికి తీసుకురానున్నారు.
News February 16, 2026
మార్కాపురం: 18 ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య.!

మార్కాపురం జిల్లా కంభంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకు మారట్లేదు. సకల జనుల సౌభాగ్యం అని నినాదాలు వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 18 ఏళ్ల క్రితం మార్కెట్ యార్డ్ వెనుక వైపు ST/SCలకోసం నిర్మించిన మదర్ థెరిస్సా కాలనీకి ఇప్పటికి కూడా కనీసం నడవడానికి సరైన దారిలేదు. తమ హయాంలో ఎంతో చేశామని చెప్పుకునే పాలకులకు ఇలాంటివి కనపడవా? అనేది ప్రశ్న.
News February 16, 2026
HYD: నిరుద్యోగులకు GOOD NEWS

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్సైట్ను సందర్శించాలన్నారు.


