News December 22, 2024
జమిలి ఎన్నికలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు: సుబ్రహ్మణ్యం

ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం తెచ్చిన బిల్లు అన్ని పార్టీలు సమర్థించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని అన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రావు తెలిపారు.
Similar News
News November 23, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 23, 2025
గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

2025–26 సీజన్కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.
News November 23, 2025
GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


