News December 22, 2024

జమిలి ఎన్నికలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు: సుబ్రహ్మణ్యం

image

ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం తెచ్చిన బిల్లు అన్ని పార్టీలు సమర్థించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని అన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రావు తెలిపారు.

Similar News

News December 12, 2025

పోలీస్ సిబ్బంది వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత: SP

image

SP వకుల్ జిందాల్ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది నుంచి నేరుగా వినతులను స్వీకరించిన SP, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాఖాపరమైన కేసుల్లో విచారణ అనంతరం సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని సూచిస్తూ, సిబ్బందికి అనువైన వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News December 12, 2025

విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల కోసం కృషి చేయాలి: DEO

image

విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు DEO సలీం బాషా సూచించారు. స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మీ పుల్లయ్య ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) పురోగతిని DEO పరిశీలించి, విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. కార్యక్రమంలో MEO ఖుద్దూస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News December 12, 2025

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలి: విజయానంద్

image

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. పెన్షన్లు, రేషన్ పంపిణీ, వైద్య సేవలు, ధాన్యం సేకరణపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.‌ ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా అధికారులు పనిచేయాలని చెప్పారు. లబ్ధిదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ అశితోష్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు.