News February 25, 2025
జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు: అనకాపల్లి ఎంపీ

జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కమిటీలో సభ్యుడైన సీఎం రమేశ్ సమావేశంలో పాల్గొని బిల్లుపై చర్చించారు. దేశంలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఖర్చు ఆదా అవుతుందన్నారు.
Similar News
News December 16, 2025
తూ.గో: నేటితో 3 ఏళ్ల నిరీక్షణకు తెర.!

పుస్తకాలే ప్రపంచంగా.. కఠిన శ్రమతో సాగించిన పోరాటం నేడు ఫలించనుంది. సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నికల జాప్యం అనంతరం తూ.గో జిల్లాలో 381 మంది కానిస్టేబుల్ ఉద్యోగ కల సాకారమైంది. మంగళగిరిలో నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీరు నియామక పత్రాలు అందుకోనున్నారు. RJYకి చెందిన అచ్యుతరావు రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఏళ్ల నిరీక్షణ తర్వాత కొలువు దక్కనుండటంతో అభ్యర్థుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
News December 16, 2025
AP న్యూస్ రౌండప్

☛ మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్లు, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కేటాయిస్తూ క్రీడా శాఖ స్పెషల్ CS అజయ్ జైన్ ఉత్తర్వులు
☛ నేడు TTD ధర్మకర్తల మండలి సమావేశం
☛ ఇంద్రకీలాద్రి: 5 రోజుల్లో దీక్షలు విరమించిన 5.77 లక్షల మంది భవానీలు
☛ ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి CM CBN
☛ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు చెవిరెడ్డి.. విచారణ 22వ తేదీకి వాయిదా
News December 16, 2025
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలు అమలు: సిద్ధిపేట సీపీ

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా BNSS163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట, దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి 18 సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.


