News December 18, 2024
జమిలి ఎన్నికల నిర్ణయం మార్పు చేసుకోవాలి: తులసిరెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న జమిలి ఎన్నికల నిర్ణయం సరైనది కాదని పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలు అవసరం లేదని, ఆచరణ కూడా సాధ్యం కాదని అన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలి అనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు మార్చుకోవాలని హితువు పలికారు.
Similar News
News January 18, 2025
Rewind: చౌటిపల్లెలో బస చేసిన సీనియర్ ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు కొండాపురం మండలంలోని చౌటిపల్లెలో గతంలో బస చేశారు. 1982 ఏడాది చివరిలో తాడిపత్రి నుంచి చైతన్య రథంలో డ్రైవర్గా హరికృష్ణతో రామారావు రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో భాగంగా చౌటిపల్లె వద్ద గల చిత్రావతి నదిపై వాహనం మొరాయించడంతో అక్కడే అగి బస చేశారు. 1993 ఎన్నికల ప్రచారంలో కూడా పాత కొండాపురంలో టీ తాగారు. నేడు NTR 29వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను పలువరురు Rewind చేసుకున్నారు.
News January 18, 2025
YSR జిల్లాపై చంద్రబాబు అసంతృప్తి
చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో చివరి మూడు స్థానాల్లో YSR జిల్లా, అల్లూరి, తూ.గో జిల్లా ఉండగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను CM చంద్రబాబు హెచ్చరించారు.
News January 18, 2025
నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. ట్రాఫిక్ ఆంక్షలు.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మైదుకూరుకు వెళ్లే వాహనాల దారి పూర్తిగా మళ్లించారు. బద్వేలు- పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు ఖాజీపేట, నాగసానిపల్లె మీదుగా వెళ్లాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, కర్నులు వైపు వెళ్లే వాహనాలు టౌన్లోకి రాకుండా జాతీయ రహదారి పైనుంచి వెళ్లాలని CI సయ్యద్ తెలిపారు.