News May 25, 2024
జమ్మలమడుగులో అత్యధిక ఉష్ణోగ్రత

భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందినా.. తిరిగి సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా జమ్మలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వల్లూరు, పెద్దముడియంలో 40.7, ఒంటిమిట్ట, కడప, సిద్దవటంలో 40.6, అట్లూరులో 39.1, చెన్నూరులో 39.8 డిగ్రీలు, ఇలా మిగిలిన మండలాల్లో సైతం 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 9, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 9760 మంది హాజరు

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో జరిగిన ఇంటర్ 2nd ఇయర్ గణితం పేపర్-2B పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి పరీక్షలకు 10,136 మంది విద్యార్థులకు గాను.. 9,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. 396 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 9381 మందికి గాను.. 9120 మంది పరీక్షలు రాశారు. 261 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 755 మందికి గాను.. 620 మంది హాజరయ్యారు.
News March 9, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,920
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,646
*వెండి 10 గ్రాముల ధర రూ.2,685.
News March 9, 2026
పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరి మృతి.!

పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి పోలీసులు సోమవారం తెలిపారు. అనసూయ (60), ఓబులేసు(58) మృతి చెందారని అన్నారు. వీరి సంబంధీకులు ఎవరైనా ఉంటే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ (9490387344, 9154666607) నంబర్లను సంప్రదించాలన్నారు.


