News June 28, 2024

జమ్మలమడుగులో పెళ్లికి వెళ్లి వస్తుండగా వ్యక్తి మృతి

image

ముద్దనూరు ప్రధాన రహదారిలోని చిటిమిటి చింతల గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు.. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన మార్క్ (49) మృతిచెందాడు. బైక్ పై వివాహానికి వెళ్లి వస్తుండగా చిటిమట్టి చింతల వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఏఎస్ఐ మురళి యాదవ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 7, 2024

టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్

image

కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

News October 7, 2024

YVU బీటెక్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

కడప YVU, ప్రొద్దుటూరు YSR ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ 2,4 సెమిస్టర్లు, బిటెక్ డిప్లమా 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈశ్వర్ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంరెడ్డితో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్‌ 59.04 శాతం, 4వ సెమిస్టర్ 62.38 శాతం, బీటెక్ డిప్లొమా 79.70 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.

News October 7, 2024

రాజంపేట: బైక్‌ స్కిడ్.. కుమారుడి మృతి

image

తండ్రీ కొడుకులు బైక్‌పై బయటకు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి కొడుకు మృతి చెందిన ఘటన రాజంపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజంపేటలోని పాత బస్టాండ్ సర్కిల్‌లో ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన తండ్రీ బాబూరామ్, పెద్ద కుమారుడు శ్యామ్ (5)బైక్‌పై వెళ్తున్నారు. బండి ఒక్కసారిగా స్కిడ్ అయి కొడుకు తల బలంగా రోడ్డును తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.