News June 28, 2024
జమ్మలమడుగులో పెళ్లికి వెళ్లి వస్తుండగా వ్యక్తి మృతి

ముద్దనూరు ప్రధాన రహదారిలోని చిటిమిటి చింతల గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు.. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామానికి చెందిన మార్క్ (49) మృతిచెందాడు. బైక్ పై వివాహానికి వెళ్లి వస్తుండగా చిటిమట్టి చింతల వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఏఎస్ఐ మురళి యాదవ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
కడపలో గంజాయి, అసాంఘిక శక్తులపై డ్రోన్ నిఘా

కడప నగరంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తారకరామా నగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి జల్లెడ పట్టారు. గంజాయి, బహిరంగ మద్యపానం చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 9, 2025
కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.
News December 9, 2025
కడప జిల్లా SP కీలక సూచన.!

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.


