News April 10, 2025
జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్ను పక్కా ప్లాన్తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.
Similar News
News October 29, 2025
కడప జిల్లాలోని కాలేజీలకు కూడా ఇవాళ సెలవు

కడప జిల్లాపై తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని డీఈవో శంషుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఇవాళ కాలేజీలకు కూడా సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
అప్రమత్తతతో సహాయక చర్యలపై దృష్టి సారించండి: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టంపై అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను వర్షాల పరిస్థితులను ఎదుర్కొనే సహాయక చర్యలు, సంసిద్ధతపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
కడప: రాష్ట్రస్థాయి టోర్నీకి ఎంపికైన IIIT విద్యార్థి

గుంటూరు జిల్లా తెనాలిలో ఈనెల 30 నుంచి నవంబర్ 1 వరకు బాయ్స్ అండర్ – 17 విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో కడప జిల్లా జట్టుకు ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్కేవ్యాలీ ట్రిపుల్ఐటీ పీయూసీ విద్యార్థి జి. తంగరాజ్ జిల్లా జట్టులో చోటు సాధించాడు. ఈ సందర్భంగా ఆర్కేవ్యాలీ ఫిజికల్ డైరెక్టర్ రమణారెడ్డి, తదితరులు అభినందించారు.


