News April 10, 2025

జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

image

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్‌తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.

Similar News

News November 20, 2025

కడప: తప్పు చేసిన వారితోనే సరి చేయించండి!

image

ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసిన వారితోనే సరిచేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో వైసీపీ హయాంలో పేజ్ -3లో 13,681 ఇళ్లులు మంజూరయ్యాయి. వాటిలో పునాది దశ దాటని 6298 ఇళ్లకు బిల్లులు చేశారు. ఆ ఇళ్లపై నిన్న విజయవాడలో గృహనిర్మాణ శాఖ కమిషనర్, ఎండి వద్ద సమావేశం జరిగింది. ఆ ఇళ్లకు బిల్లులు తీసుకున్న వారితోనే పూర్తి చేయించాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు నిర్ణయించారు.

News November 20, 2025

నేడు ఎర్రగుంట్ల RTPPకి అసెంబ్లీ కమిటీ.!

image

నేడు ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)ను రాష్ట్ర అసెంబ్లీ కమిటీ సభ్యులు సందర్శిస్తున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో 12 మంది కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లనున్నారు. RTPPలో విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, బొగ్గు కొరత తదితర అంశాలపై కమిటీ పరిశీలించనుంది. కాగా RTPP అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News November 20, 2025

కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

image

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.