News February 8, 2025
జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.
Similar News
News March 20, 2025
వైవియూ దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

కడప: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. వైవీయూ అధ్యయన కేంద్రాల్లో ఎం.ఏ. ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం.కామ్. కోర్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు.
News March 19, 2025
కడప ZP ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 27వ తేదీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఛైర్మన్ను ఎన్నుకునే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామాతో ఇన్ఛార్జి జడ్పీ ఛైర్మన్గా శారద కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపైన ఆసక్తిగా మారింది.
News March 19, 2025
జ్యోతి క్షేత్రమును సందర్శించనున్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి బుధవారం శ్రీ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రమును సందర్శించనున్నారు. జ్యోతి క్షేత్రములో కాశినాయన స్వామిని దర్శించుకొని అనంతరం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన వసతి భవనాలను, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో పునఃనిర్మించిన భవనాలను పరిశీలించనున్నారు.