News January 26, 2025

జమ్మికుంట: ఎలివేటర్ యంత్రంలో ఇరుక్కొని మహిళా కూలీ మృతి

image

జమ్మికుంటకు చెందిన బమ్మ వనిత (54) శాయంపేటలోని ఆగ్రోఇండస్ట్రీస్ రైస్ మిల్లులో పనిచేస్తుంది. జనవరి 22న మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఎలివేటర్ యంత్రంలో తలకు ఉన్న టవల్ ఇరుక్కుని చెయ్యి తెగిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో మిల్లు సిబ్బంది వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిందని ఆమె కుమారుడు ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News September 19, 2025

భారత్-చైనాని ట్రంప్ భయపెట్టలేరు: రష్యా మంత్రి

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బెదిరింపులు భారత్-చైనాలను భయపెట్టలేకపోయాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ‘నాకు నచ్చనిది చేయకండి టారిఫ్స్ విధిస్తాను అన్న ధోరణి ప్రాచీన నాగరికత కలిగిన భారత్, చైనా విషయంలో పనిచేయదు. అమెరికాకు అది అర్థమవుతోంది. సుంకాలు వేస్తే ఆ దేశాలను ఇంధనం, మార్కెట్ వంటి రంగాల్లో ఆల్టర్నేటివ్స్ వైపు మళ్లిస్తాయి’ అని తెలిపారు.

News September 19, 2025

Bigg Boss: ఆ ముగ్గురు డేంజర్ జోన్‌లో!

image

ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి, పవన్, ప్రియ, భరణి, ఫ్లోరా, మనీశ్, హరీశ్ ఉన్నారు. ఈ ఏడుగురిలో సుమన్ శెట్టి ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హరీశ్, ఫ్లోరా కూడా మంచి పొజిషన్‌లోనే ఉండొచ్చు. కానీ మనీశ్, పవన్, ప్రియ డేంజర్ జోన్‌లో ఉండే ప్రమాదం ఎక్కువ కనిపిస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని రివ్యూవర్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? కామెంట్ చేయండి.

News September 19, 2025

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పతనం

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ.7,665, కనిష్ఠంగా రూ.7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.4,568, కనిష్ఠ ధర రూ.4,093, ఆముదం గనిష్ఠ ధర రూ.6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ.8-12 వేల వరకు పత్తిని కొనుగోలు చేసేవారని అన్నారు.