News April 9, 2025

జమ్మికుంట: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన కారు

image

నిద్రిస్తున్న వ్యక్తులపై కారు దూసుకెళ్లిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్లు సుమన్ కుమార్ మహత్, పబిత్ర మాజీ సోమవారం రాత్రి 10.30లకు ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్ ఎదురుగా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కులగూడెంకు చెందిన పొనగంటి సాత్విక్ కారును అజాగ్రత్తగా నడుపుకుంటూ.. వాళ్ల కాళ్ల మీద నుంచి వెళ్లాడు. దీంతో వాళ్ల కాళ్ల విరిగిపోయాయి.

Similar News

News December 23, 2025

అంతా హేమాహేమీలే.. భూపేశ్‌కు కత్తి మీద సామే!

image

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న ఆయనకు జిల్లాలోని హేమాహేమీలైన నేతలను మేనేజ్ చేయడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. ఎమ్మెల్యేలందర్నీ ఒకతాటిపై తీసుకొచ్చి.. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి అధిక సీట్లను కైవసం చేసుకునేలా చేయడం ఆయనకు అతి పెద్ద టాస్క్. అలాగే అంతర్గత పార్టీ కుమ్ములాటలకు భూపేశ్ ఏ విధంగా పరిష్కారం చూపుతారనేది చూడాలి.

News December 23, 2025

పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

image

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.

News December 23, 2025

అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

image

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్‌లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.