News April 9, 2025

జమ్మికుంట: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన కారు

image

నిద్రిస్తున్న వ్యక్తులపై కారు దూసుకెళ్లిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్లు సుమన్ కుమార్ మహత్, పబిత్ర మాజీ సోమవారం రాత్రి 10.30లకు ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్ ఎదురుగా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కులగూడెంకు చెందిన పొనగంటి సాత్విక్ కారును అజాగ్రత్తగా నడుపుకుంటూ.. వాళ్ల కాళ్ల మీద నుంచి వెళ్లాడు. దీంతో వాళ్ల కాళ్ల విరిగిపోయాయి.

Similar News

News October 14, 2025

IPS ఆత్మహత్య.. డీజీపీకి ‘సెలవు’

image

హరియాణాలో తెలుగు IPS పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న DGP శత్రుజిత్ కపూర్‌ను ప్రభుత్వం ‘బలవంతపు సెలవు’పై పంపింది. రోహ్‌తక్ SP నరేంద్ర బిజార్నియాపై ఇప్పటికే బదిలీ వేటు వేసింది. ఉన్నతాధికారుల కులవివక్ష వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పూరన్ భార్య, IAS అమ్నీత్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

News October 14, 2025

KNR: బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం..!

image

KNR(D) కొత్తపల్లి PS పరిధిలో ఘోరం జరిగింది. ఓ బాలికకు ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాని(గ్రానైట్ క్వారీ)కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కాగా, వీరందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం. బాలిక, యువకులు చిన్నపటి నుంచి కలిసి తిరిగేవారు. ఈ క్రమంలోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అక్కడితో ఆగకుండా ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశారు. వీడియో వైరలై బాలిక కుటంబీకుల కంటపడింది.

News October 14, 2025

రేపటి నుంచి నో ఫ్లై జోన్ : కర్నూలు ఎస్పీ

image

రేపటి నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ‘No Fly Zone for Drones’గా ప్రకటించామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రధాని <<18001616>>మోదీ<<>> పర్యటన ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా, 7500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పసుపుల రోడ్డులోని కన్వెకేషన్ హాల్‌లో బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.