News April 9, 2025

జమ్మికుంట: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన కారు

image

నిద్రిస్తున్న వ్యక్తులపై కారు దూసుకెళ్లిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్లు సుమన్ కుమార్ మహత్, పబిత్ర మాజీ సోమవారం రాత్రి 10.30లకు ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్ ఎదురుగా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కులగూడెంకు చెందిన పొనగంటి సాత్విక్ కారును అజాగ్రత్తగా నడుపుకుంటూ.. వాళ్ల కాళ్ల మీద నుంచి వెళ్లాడు. దీంతో వాళ్ల కాళ్ల విరిగిపోయాయి.

Similar News

News December 23, 2025

90% సొంత టెక్నాలజీ అట.. పాక్ పిట్టకథలు!

image

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ధాటికి వణికిపోయిన పాక్.. ఇప్పుడు అబద్ధాలతో కవర్ చేస్తోంది. 90% సొంత టెక్నాలజీతో భారత యుద్ధ విమానాలను కూల్చామంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ జోకులేస్తున్నారు. నిజానికి మన దెబ్బకు పాక్ దగ్గరున్న చైనా ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదని ఆధారాలతో సహా ప్రపంచానికి చూపించాం. పరువు కాపాడుకోవడానికి, తుప్పు పట్టిన ఆయుధాలను అమ్ముకోవడానికి మునీర్ ఇప్పుడు పిట్టకథలు చెప్పడం ఎంత విడ్డూరమో!

News December 23, 2025

NLG: అమ్మో ర్యాగింగ్ భూతం..!

image

కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించడానికి కళాశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులను ర్యాగింగ్ భూతం భయపెడుతుంది. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక మెడికల్ కళాశాలలో ప్రారంభమైన ఈ విష సంస్కృతి క్రమంగా డిగ్రీ కళాశాలల్లోకి ప్రవేశించింది. తాజాగా స్థానిక గురుకుల కళాశాలలో తోటి విద్యార్థుల వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని 4 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News December 23, 2025

విజయవాడ: మందుల కోసం బారులు.. నేతలకు కానరాని సమస్య!

image

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో మందులు కోసం ప్రజలు బారులుతీరారు. ఒకే కౌంటర్ ఉండటంతో మందులు కోసం 2 గంటలు లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అత్యవసరంగా మందులు అవసరమైనా అందని పరిస్థితి. అయితే ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి సమస్యలు వారి దృష్టిలోకి రాకపోవడం, కనిపించకపోవడం గమనార్హం.