News March 21, 2025

జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 17, 2025

KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ

image

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్‌ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్‌తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

News November 17, 2025

KNR: ప్రైవేటు ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ

image

కరీంనగర్ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డీఎంహెచ్‌ఓ డా. వెంకటరమణ స్పెషల్ డ్రైవ్ టీమ్‌తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రుల్లోని రిజిస్టర్లు, పేషెంట్ అనుమతి పత్రాలు, ఫామ్(F) డాక్యుమెంట్లను పరిశీలించారు. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ (MTP), అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ (ART) చట్టాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

News November 17, 2025

మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

image

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.