News February 26, 2026

జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,550 పలుకగా.. గురువారం రూ.50 పెరిగి రూ.7,600 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు రైతులు 25 వాహనాల్లో 206 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 13, 2026

సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

image

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.

News April 13, 2026

HYD: GREAT.. 11ఏళ్లుగా FREE కోచింగ్

image

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.

News April 13, 2026

IPL తరహాలో గుంతకల్లులో క్రికెట్ టోర్నమెంట్

image

గుంతకల్లులోని పాతగుంతకల్లులో ఐపీఎల్ తరహాలో ఓల్డ్ గుంతకల్ ప్రీమియర్ లీగ్ (ఓజీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఐపీఎల్ తరహాలోనే టీం సెలక్షన్, ప్లేయర్స్ యాక్షన్ జరిగింది. ఆదివారం జరిగిన ప్లేయర్స్ యాక్షన్‌లో పలువురు పాతగుంతకల్లు యువకులు పాల్గొన్నారు. షాడో బ్లాస్టర్స్, సిడ్నీ సిక్సర్స్, కిట్టు స్మాషర్స్, రాయల్ స్ట్రైకర్స్, ఛాంపియన్ చేజర్స్ టీమ్స్ ఉన్నాయి. త్వరలోనే టోర్నీ ప్రారంభంకానుంది.