News December 10, 2024

జమ్మూలో కంభం ఆర్మీ జవాన్ మృతి

image

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సోమవారం జమ్మూ కశ్మీర్‌లో మృతి చెందాడు. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పని చేస్తున్న వరికుంట్ల వెంకట సుబ్బయ్య అనే జవాన్ జమ్మూ కశ్మీర్‌లో వీధులు నిర్వహిస్తుండగా మందు పాతర పేలి వీర మరణం పొందాడు. కాగా ప్రస్తుతం అతని మృతదేహాన్ని రాజా సుఖదేవ్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌కు తరలించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Similar News

News October 19, 2025

ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 19, 2025

ప్రకాశంకు భారీ వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 18, 2025

ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

image

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.