News August 6, 2024

జయశంకర్ సార్ ఆశయాలకు తెలంగాణ కట్టుబడి ఉంది: ఎంపీ చామల

image

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలను తెలంగాణ ప్రజలు స్మరించుకుంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని వారి సేవలను ఎంపీ గుర్తు చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి, రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు.

Similar News

News October 25, 2025

NLG: 31 వరకు ఆసరా పెన్షన్ల పంపిణీ

image

ఆసరా పింఛన్లను ఈ నెల 31వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని సూచించారు.

News October 25, 2025

అక్టోబర్ 30 నుంచి టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు: డీఈఓ

image

మార్చి 2026లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు వివరాలను డీఈఓ బొల్లారం భిక్షపతి వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ. 110 చొప్పున అక్టోబరు 30 నుంచి నవంబరు 13వ తేదీలోపు చెల్లించాలని తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 29, రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500ల అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News October 24, 2025

పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేండి: కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

image

వర్షాల దృష్ట్యా పత్తిని రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రైతులకు విజ్ఞప్తి చేశారు. మునుగోడులో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తిలో తేమ 8-12 శాతం లోపు ఉండేలా చూడాలని, ‘కపాస్‌ కిసాన్‌’ యాప్ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే కొనుగోలు ఉంటుందని తెలిపారు.