News March 14, 2025

జయ కేతనం సభలో ఆకట్టుకున్న ప్రదర్శన

image

చిత్రాడలో జనసేన జయకేతనం సభ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక జానపద నృత్యం ‘డొల్లు కుణిత’ కళాకారుల ప్రదర్శన విశేషంగా అలరించింది. అంతకుముందు వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

Similar News

News October 31, 2025

ఆసిఫాబాద్: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైతు ఆత్మహత్య

image

చేతికి వచ్చిన పంట తుపాన్ ప్రభావంతో నష్టపోయిందని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. లింగాపూర్(M ) సీతారాంనాయక్ తండాలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతు బలిరామ్(59) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి, మొక్కజొన్న పంట దెబ్బతినడంతో పురుగుమందు తాగాడు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News October 31, 2025

విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

image

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.

News October 31, 2025

కళ్యాణదుర్గం: బొలెరో బోల్తా.. ఒకరి మృతి

image

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టూరు నుంచి పామిడి వైపు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.