News August 8, 2024
జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల నిరాకరణ చెల్లదు: హైకోర్టు

చిన్న పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్లు నిరాకరణ చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను సవాలు చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన తాటికొండ కృష్ణ అనే జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయం కాదని, కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Similar News
News December 15, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు
News December 15, 2025
MBNR: ఆరోజు వైన్ షాపులు బంద్: ఎస్పీ

పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డ్లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని ఎస్పీ డి.జానకి తెలిపారు. మూడో విడుత సర్పంచ్ ఎన్నికల భద్రతా దృష్ట్యా మద్యం దుకాణాలు ఈనెల 15 సా.5:00 గంటల నుంచి 18 ఉ.10:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని, మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 15, 2025
MBNR: గుంపులుగా గుమికూడరాదు: ఎస్పీ

మూడో విడత ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు/అంతకన్నా ఎక్కువ మంది గుంపులుగా గుమికూడరాదని ఎస్పి డి.జానకి సూచించారు. పోలింగ్కు ముందు(15న) సాయంత్రం 5:00 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు,ఇంటింటా ప్రచారం,లౌడ్స్పీకర్ల వినియోగం,ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు.


