News January 25, 2025

జలవనరుల శాఖ ఎస్ఈగా ద్వారకనాథ్ రెడ్డి

image

కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈగా ఎస్.ద్వారక నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ద్వారక నాథ్ రెడ్డి పదోన్నతిపై కర్నూలు ఎస్ఈగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా బాల చంద్రా రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.

Similar News

News October 15, 2025

పీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు: సీఎం

image

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కమాండ్ కంట్రోల్ నుంచి కలెక్టర్ సిరి, పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరపాండ్యన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు.

News October 15, 2025

ప్రధాని పర్యటన సాఫీగా నిర్వహించాలి: డీజీపీ

image

ప్రధాని మోదీ పర్యటన సాఫీగా నిర్వహించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

News October 15, 2025

కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

image

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.