News June 27, 2024
జలుమూరులో 20 తులాల బంగారు చోరీ

జలుమూరు మండలంలోని నగరి కటకంలో జరిగిన చోరీలో 20 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురి అయ్యాయని బాధితుడు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలకు వెళితే స్థానికంగా ఉన్న రేజేటి శ్రీనివాసరావు తన కుమారుడు హైదరాబాదులో అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాడు. తిరిగి బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చేసేసరికి చోరీ జరిగినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 3, 2026
శ్రీకాకుళం: B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
News January 3, 2026
శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
టెక్కలి: డివైడర్పై వృద్ధుడి మృతదేహం

టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రహదారి డివైడర్పై శుక్రవారం ఒక వృద్ధుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండలంలోని కంట్రగడ గ్రామానికి చెందిన వీ.ఆనంద్ (71) అనే వృద్ధుడు కొన్నేళ్లుగా టెక్కలిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మేరకు కాంప్లెక్స్ సమీపంలోని మృతిచెంది పడి ఉండడంతో స్థానికులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. అనారోగ్య సమస్యతో మృతిచెంది ఉండొచ్చని స్థానికులు అంటున్నారు.


