News April 3, 2025

జలుమూరు: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

image

జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్య పేట గ్రామానికి చెందిన రవికిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పలాసలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో ఎంపైర్‌గా సేవలు అందించారు. వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు దిగ్ర్భాంతి  వ్యక్తం చేశారు.

Similar News

News April 12, 2025

SKLM: ఎస్సీలకు రూ.18.74 కోట్ల ప్రోత్సాహం

image

ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26 కింద శ్రీకాకుళం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 450 మంది లబ్ధిదారులకు రూ.18.74 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

News April 12, 2025

శ్రీకాకుళం జిల్లాకు 23వ స్థానం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16,926 మంది పరీక్షలు రాయగా 12,532 మంది పాసయ్యారు. 74 శాతం పాస్ పర్సంటేజీతో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 23 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18,574 మందికి 11,733 మంది పాసయ్యారు. 63శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది.

News April 12, 2025

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులారా.. GET READY

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఫస్టియర్ 20,389 మంది, సెకండియర్ 19,967 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 40,356 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!