News October 19, 2024
జలుమూరు: 45రోజులు వెలిగే ఆకాశదీపం గురించి తెలుసా.?

కార్తికమాసం ప్రారంభానికి 15రోజుల ముందు జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఒడిశా రాజులు నిర్మించిన దేవాలయం కావడంతో ఆ సంప్రదాయం ప్రకారం.. శుక్రవారం ఇక్కడ దీపం వెలిగించారు. అప్పటి సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని, ఆశ్వయుజ మాసం పౌర్ణమి మరుసటి రోజు నుంచి కార్తిక మాసం చివరి వరకు 45రోజులు దీపం వెలిగిస్తామని అర్చకులు చెప్పారు. ఈ దీపం గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
Similar News
News October 15, 2025
కళింగపట్నం బీచ్లో ఆకట్టుకున్న GST సైకత శిల్పం

సిక్కోలు జిల్లా కళింగపట్నం బీచ్లో ఏర్పాటు చేసిన జీఎస్టీ (GST) అంశంపై సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక కళాకారుడు ఇసుకతో తీర్చిదిద్దిన ఈ శిల్పం, ప్రజల్లో పన్నుల వ్యవస్థపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ శిల్పం వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.
News October 15, 2025
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మందాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News October 15, 2025
SKLM: అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.