News October 19, 2024

జలుమూరు: 45రోజులు వెలిగే ఆకాశదీపం గురించి తెలుసా.?

image

కార్తికమాసం ప్రారంభానికి 15రోజుల ముందు జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయంలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఒడిశా రాజులు నిర్మించిన దేవాలయం కావడంతో ఆ సంప్రదాయం ప్రకారం.. శుక్రవారం ఇక్కడ దీపం వెలిగించారు. అప్పటి సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని, ఆశ్వయుజ మాసం పౌర్ణమి మరుసటి రోజు నుంచి కార్తిక మాసం చివరి వరకు 45రోజులు దీపం వెలిగిస్తామని అర్చకులు చెప్పారు. ఈ దీపం గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

Similar News

News January 8, 2026

SKLM: ఉద్యోగాల దరఖాస్తులకు నేడే లాస్ట్ ఛాన్స్

image

శ్రీకాకుళం జిల్లాలోని మోడల్ స్కూల్ లలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు గురువారంతో ముగియనుంది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మోడల్స్ స్కూళ్లలో దాదాపు 15 పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రవిబాబు ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సందర్శించాలని దరఖాస్తులను ఆయా మోడల్ స్కూల్‌లలో సమర్పించవచ్చని ఆయన సూచించారు.

News January 8, 2026

శ్రీకాకుళం జిల్లాలో అష్ట ఈవోలేనా?

image

శ్రీకాకుళం జిల్లాలోని దేవాదాయశాఖలో ఈఓల(Executive Officers) కొరత ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో పర్యవేక్షణతో పాటు ఎండోమెంట్ భూముల పరిరక్షణ కొరవడుతోంది. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో 795 ఆలయాలకు కేవలం 8 మంది ఈఓలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఈఓలు నాలుగు నెలలలో ఉద్యోగ విరమణ కానున్నారు. దీంతో దేవాదాయశాఖ అంశాల పర్యవేక్షణ మరింత క్లిష్టతరమవుతోంది.

News January 8, 2026

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి

image

మందస మండలం రాధాకృష్ణపురం సమీపంలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని జిల్లా సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మెనూ, వంటశాల, భోజనశాల, సరుకుల గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గురుకులంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు.