News April 17, 2024
జహీరాబాద్లో త్రిముఖ పోరు?
ZHB లోక్సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ZHB పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ (సురేశ్ షెట్కర్), 2014, 2019లో BRS (బీబీ పాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి CONG, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తుండడంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేపుతోంది.
Similar News
News February 1, 2025
NZB:14.5 తులాల బంగారం చోరీ
సిరికొండ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య ఇంట్లో 14.5 తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని సిరికొండ ఏఎస్ఐ బాల్ సింగ్ తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. సత్తయ్య శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాను చూడగా బంగారం పోయిందని బాధితుడు వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News February 1, 2025
నవీపేట్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నవీపేట్ మండలం ఎంచ గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. రావుల పెద్దయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నవీపేట్ సుభాష్ నగర్కి చెందిన రెండో భార్య సవిత ప్రతిరోజూ గొడవ పడుతుండేది. ఆమె బంధువులు వచ్చి బెదిరించడంతో గొడవ ఏర్పడింది. దీంతో పెద్దయ్య ఆవేశంలో శుక్రవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 1, 2025
NZB: ఫేక్ యాప్తో మోసం.. ఇద్దరి అరెస్ట్
ఫేక్ యాప్లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.