News March 16, 2025

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

జహీరాబాద్ మండలం హుగ్గెల్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాన్ వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ప్రదీప్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని చెల్లెలు ఆశ(18) తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రదీప్ మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉంది.

Similar News

News November 17, 2025

న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలి: నాగరాణి

image

న్యాయపరమైన చట్టాలపై రిటైర్డ్ ఉద్యోగులు ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు, తెలిసినవారికి న్యాయ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.

News November 17, 2025

న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలి: నాగరాణి

image

న్యాయపరమైన చట్టాలపై రిటైర్డ్ ఉద్యోగులు ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు, తెలిసినవారికి న్యాయ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.

News November 17, 2025

19న నల్గొండలో జాబ్ మేళా

image

ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి, గ్రాడ్యుయట్, D/B/M- Pharmacy చదివిన వారు అర్హులని తెలిపారు.