News March 7, 2025

జహీరాబాద్‌లో విషాదం.. పొలంలో విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

image

జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్‌కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ఇదే కుటుంబానికి చెందిన తండ్రి నాగన్న పాము కాటుకు గురై మరణించడం గమనార్హం.

Similar News

News October 14, 2025

నేడే పైడిమాంబ తెప్పోత్సవం.. ఏర్పాట్లు పూర్తి..!

image

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం నేడు జరగనుంది. ఈ సందర్భంగా పెద్ద చెరువు వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా వనం గుడి వద్ద వేద సభ ఉంటుందని, సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం ప్రారంభం కానుందని ఆలయ అధికారులు తెలిపారు.

News October 14, 2025

MBNR:PU.. 30కి పైగా కోర్సులు..157 కళాశాలలు

image

పాలమూరు వర్సిటీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం YSR ప్రారంభించగా.. 6 కోర్సుల్లో 180 మందితో మొదలైంది. ప్రస్తుతం దాదాపుగా 31 పైగా కోర్సులు, పాలమూరు వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల్లో 16 వేలకు పైగా మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 157 కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా వర్సిటీలో ఇంజినీరింగ్, లా కోర్సులు ప్రారంభమయ్యాయి. ఈనెల 16న స్నాతకోత్సవం సందర్భంగా.. ‘Way2News’ ప్రత్యేక కథనం.

News October 14, 2025

ట్రంప్‌కు 2026లోనైనా ‘శాంతి’ దక్కేనా?

image

8 యుద్ధాలు ఆపానని, తన కంటే అర్హుడు మరొకరు లేరని ఓ మినీ సైజ్ యుద్ధం చేసినా ట్రంప్‌కు 2025-నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. తాజాగా ఇజ్రాయెల్‌, పాక్ ఆయన్ను ఆ ప్రైజ్‌కు నామినేట్ చేశాయి. గడువులోగా నామినేషన్లు రాక ట్రంప్ పేరును నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకొని విషయం తెలిసిందే. వచ్చే JAN31 వరకు గడువు ఉండటంతో 2026 రేసులో ట్రంప్ ముందున్నట్లు తెలుస్తోంది. 2026లోనైనా పీస్ ప్రైజ్ ఆయన్ను వరిస్తుందా? మీ COMMENT.