News April 1, 2025

జాగ్రత్త.. నంద్యాలలో భారీ చోరీ

image

నంద్యాల నగరంలోని క్రాంతి నగర్‌లో 2 రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. నంద్యాల రూరల్ PS ఎస్‌ఐ గంగయ్య వివరాల ప్రకారం.. ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాన్ కుటుంబ సమేతంగా 2 రోజుల ముందు HYD వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇదే అదునుగా చేసుకుని ఇంట్లో చొరబడి 6 తులాల బంగారం, అర్ధకేసీ వెండి, రూ.5.30 లక్షల నగదు చోరీ చేశారు. ఈ ఘటన మొత్తం CC కెమెరాలో రికార్డ్ కాగా ఇదంతా చెంచు గ్యాంగ్ పనని తేలింది.

Similar News

News November 5, 2025

కొత్తగూడెం: సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

image

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని ఎస్టీపీపీ డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్‌ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పోరేట్‌కు బదిలీ చేశారు.

News November 5, 2025

‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.

News November 5, 2025

సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

image

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని NTPC డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్‌ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పొరేట్‌కు ట్రాన్ఫర్ చేశారు.