News March 15, 2025

జాతరేమో పరకాలలో.. రాజకీయమంతా నర్సంపేటలో..!

image

గీసుకొండ మండలం కొమ్మాల జాతర పాలన పరంగా పరకాల నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఈ జాతర ప్రభావం రాజకీయంగా నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో రాజకీయ పార్టీల నేతలు ప్రభ బండ్లను కడుతారు. ఏటా ఈ ప్రభ బండ్ల విషయంలో నర్సంపేటలో రాజకీయ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులకు జాతర అగ్ని పరీక్షలా మారుతోంది.

Similar News

News April 19, 2026

‘జంబలకిడిపంబ’… బరాత్‌తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

image

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్‌లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.

News April 19, 2026

‘జంబలకిడిపంబ’… బరాత్‌తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

image

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్‌లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.

News April 19, 2026

జమ్మికుంట: జిల్లా పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా కందికట్ల పద్మ

image

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత ఐక్య వేదిక కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా విభాగ నూతన అధ్యక్షురాలిగా జమ్మికుంటకు చెందిన కందికట్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.