News December 22, 2024

జాతి వైర్యాన్ని మరిచి తల్లి ప్రేమను చాటిన వరాహం

image

రాయదుర్గంలో జాతి వైర్యాన్ని సైతం మరిచి ఓ వరాహం శునకం పిల్లలకు పాలు ఇచ్చి అమ్మతనాన్ని చాటుకుంది. కోటలో శంకరమఠం ఆలయం సమీపాన ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రజలు ఈ ఘటన చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు తెలిపారు.

Similar News

News October 25, 2025

డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డ్రగ్స్, గంజాయి నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్, గంజాయిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.

News October 24, 2025

రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్‌తో కలిసి నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గుత్తి -గుంతకల్లు రోడ్లోని రోడ్ & ఆర్ఓబీని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు.

News October 24, 2025

జేసీ వ్యాఖ్యలను ఖండించిన అనంతపురం రేంజ్ డీఐజీ

image

తాడిపత్రి ASP రోహిత్ కుమార్ చౌదరిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అనంతపురం రేంజ్ DIG షేమోషీ తీవ్రంగా ఖండించారు. గురువారం తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ వారికి దేశ సేవ చేయడమే ప్రధాన ధ్యేయం అన్నారు. తమకు కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని అవమానకర భాషలో సంభోదించడం పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధం అన్నారు.